ఉప్పెన
సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న
హీరోయిన్ కృతి శెట్టి. ఇప్పుడు
కోలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. తెలుగులో ఈ
సినిమా తర్వాత
శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈమె అతి తక్కువ కాలంలోనే అగ్ర
హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాలు సైతం పెద్ద హీరోల సినిమాలు కావడంతో ఆమెకు తొందరలోనే నంబర్ వన్ స్థానం కూడా రాబోతుంది అని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె తనకున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని భావించి ఇతర భాషలలో సైతం సినిమాలు చేయడానికి సిద్ధమవుతోంది. అలా
సూర్య హీరోగా నటించబోయే కొత్త సినిమాలో ఈమె
హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈటీ
సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న
సూర్య ఈ
సినిమా ఆయనకు మంచి ఇమేజ్ని తెచ్చిపెట్టింది. కానీ
థియేటర్ రిలీజ్ స్థాయిలో మాత్రం పేరు ను తీసుకు రాలేకపోయాయి. దీంతో
సూర్య కాస్త వెనుకబడి ఉన్నాడు అని చెప్పవచ్చు. ఈ సినిమాకు ఓపెనింగ్స్ వరకు పర్వాలేదు కానీ ఆ తరువాత పూర్తిగా ఈ
సినిమా తేలిపోయింది. తెలుగులో అయితే భారీ డిజాస్టర్ గా ఈ
సినిమా మిగిలిపోయింది అని చెప్పవచ్చు
అలా
సూర్య ఇప్పుడు చేస్తున్న సినిమాల పై మంచి అంచనాలు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే
బాలా దర్శకత్వంలో ఆయన
సినిమా చేయబోతున్నాడు. గతంలో పితమగన్ అనే
సినిమా హీరో గా
సినిమా చేశాడు. తెలుగులో శివపుత్రుడు గా ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఆ చిత్రం లో
విక్రమ్ ఎక్కువగా హైలెట్ అయ్యాడు.
సూర్య పేరు తక్కువగా వినిపించింది. ఈ నేపథ్యంలో అభిమానుల నుంచి డిమాండ్ బాగా నెలకొనగా తాజాగా వీరి కాంబో లో
సినిమా ఇప్పుడు రూపుదిద్దుకోవడానికి సిద్ధం అవుతుంది. అలా ఈ చిత్రంలో కృతి శెట్టి ను
హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెకు ఈ సినిమాతో ఎంతటి స్థాయి గుర్తింపు వస్తుందో చూడాలి.