త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఇప్పుడు ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా యొక్క షూటింగ్ కూడా మొదలయ్యింది. అన్నపూర్ణ స్టూడియో లో వేసిన ఓ భారీ సెట్ లో ఈ సినిమా యొక్క షూటింగ్ జరుపుకుంటుంది. మహేష్ బాబు పై ఈ సెట్లో కొన్ని కీలకమైన సీన్లు చిత్రీకరించనున్నారు. ఆ విధంగా త్రివిక్రమ్ మరియు మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు భారీ స్థాయిలోనే పెరిగిపోయాయి.

మొదటి నుంచి త్రివిక్రమ్ తన సినిమాలలో మహిళలకు మంచి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకొని వారికి మంచి ప్రాధాన్యత ఉండే విధంగా కథ కథనాలను రాసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ల పాత్రలు మాత్రమే కాదు ఆ సినిమాలలో వచ్చే ప్రతి పాత్ర కూడా ఎంతో అర్థవంతంగా ఉండేలా రాసుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఒక సీనియర్ నటిని తన సినిమాలో నటింపజేసి సినిమా అంతా ఆమె పాత్ర పై ఆధారపడేలా చేసి చిత్రాన్ని ఎంతో ఆసక్తి పరచడంలో త్రివిక్రమ్ దిట్ట.

నదియా కుష్బూ టబు వంటి సీనియర్ హీరోయిన్లను తిరిగి సినిమాలలోకి తీసుకువచ్చి వారికి మంచి పాత్రను అందజేసిన ఘనత త్రివిక్రమ్ అని చెప్పాలి. ఆ విధంగా ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో రమ్యకృష్ణకు ఓ కీలక పాత్ర రాయబోతున్నాడట. త్వరలోనే ఆమెకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడట. ఇప్పటిదాకా ఆయన సీనియర్ హీరోయిన్లతో చేసిన పాత్రలు ప్రేక్షకులను బాగా అలరించిన నేపథ్యంలో ఈ పాత్ర కూడా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. త్వరలోనే ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ చేయనున్నారు. వచ్చే యడానికి ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేసేందుకు ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: