పఠాన్ మూవీ విడుదలై ఇప్పటికీ చాలా రోజులు అవుతోంది. ఈ సినిమా వసూళ్ల విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గుకుండా దూసుకుపోతోంది. పఠాన్ సినిమాకి పోటీగా తెలుగులో అలా వైకుంఠపురం సినిమా అని రీమిక్కుగా హిందీలో విడుదల చేయగా, మలయాళం సినిమా డ్రైవింగ్ లైసెన్స్ సినిమా సెల్ఫీగా రీమిక్స్ చేసి విడుదల చేయగా ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే పెద్ద హీరోలు అయినప్పటికీ పఠాన్ సినిమా ముందు ఈ సినిమాలేవి నిలవలేకపోయాయి.


దీంతో పఠాన్ సినిమా ఓవర్సీస్ లో దాదాపుగా 50 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అలాగే షేహాజాదా సహా సెల్ఫీ సినిమాలను ప్రేక్షకులు తిరస్కరించడం కూడా పఠాన్ సినిమాకు కాస్త కలిసొచ్చిందని చెప్పవచ్చు. దీంతో నిన్నటి రోజున రూ.1.95 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టినట్లుగా పటాన్ సినిమా తెలుస్తోంది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.505.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టినట్లు సమాచారం.ఇక ఈ రోజు కూడా ఈ సినిమా మరొక రెండు కోట్లు వసూలు చేస్తుందని రెండు వర్గాలు అంచనా వేస్తున్నాయి.


కాబట్టి రేపటి నుంచి పఠాన్ హిందీ పరిశ్రమలో ఇండియా వైడ్ గా అత్యధికంగా కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలబడడానికి ప్రయత్నిస్తోందని చెప్పవచ్చు. ఇప్పటివరకు అధికారులను కలిగి ఉన్న బాహుబలి -2 సినిమా దాటడానికి నాలుగు కోట్లు మాత్రమే కావాలి.. సిద్ధార్థ ఆనంద్ ఈ హై బడ్జెట్ ఆక్షన్ థ్రిల్లర్ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో షారుక్ ఖాన్ దీపికా పదుకొనే నటించడం జరిగింది. జాన్ అబ్రహం కూడా కీలకమైన పాత్రలో నటించారు. సినిమా వసూళ్ల విషయంలో బాలీవుడ్ రెండు సైతం ఆశ్చర్యపోయే విధంగా కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఒకరకంగా జీరో సినిమా తర్వాత భారీ డిజాస్టర్ తో సైలెంట్ అయిన షారుఖ్ ఖాన్ మళ్లీ ఇలాంటి సినిమాతో కం బ్యాక్ ఇస్తారని ఎవరు ఊహించలేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: