దర్శక ధీరుడు, దిగ్గజ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి జపాన్లో ఘనస్వాగతం లభించింది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ థియేటర్లో మళ్లీ స్క్రీనింగ్కు వచ్చిన సంగతి తెలిసిందే.ప్రపంచ చలనచిత్రసీమలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమాకి ఒక ప్రత్యేక స్థానం దక్కింది అంటే ఎక్కువ శాతం క్రెడిట్ దర్శకధీరుడు రాజమౌళికే దక్కుతుంది. ప్రపంచం మొత్తం అభిమానించే జేమ్స్ కేమరూన్ లాంటి దిగ్గజ దర్శకులను అభిమానిగా చేసుకున్న ఘనత రాజమౌళికి సాధ్యమైంది. అలాంటి జక్కన్న నుంచి వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా వరల్డ్ వైడ్ గా క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమా ఘనత ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా స్క్రీనింగ్ అవుతోంది. ఆ షోకి రాజమౌళి దంపతులు హాజరయ్యారు. అక్కడ ఒక ఘటన జక్కన్నను భావోద్వేగానికి లోనయ్యేలా చేసింది.వయసుతో సంబంధం లేకుండా ఒక వ్యక్తికి అభిమానులను, ఆరాదించే వారిని తెచ్చిపట్టేది సినిమా. ఎంటర్ టైన్మెంట్ విభాగంలో కేవలం ఆలోచన, అవుట్ పుట్ మాత్రమే ఉంటుంది. ఆ అవుట్ పుట్ కు భాష, వయసుతో సంబంధం లేకుండా అభిమానులు ఏర్పడతారు. ఇప్పుడు జక్కన్నకు కూడా వరల్డ్ వైడ్ గా అదే తరహాలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు జపాన్ లో స్క్రీనింగ్ కి హాజరైన రాజమౌళి ఆ విషయం తెలిసొచ్చింది. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తనకు దక్కుతున్న అభిమానం గురించి చెప్పుకొచ్చారు. ఈ అభిమానానికి తనకు మాటలు రావడంలేదంటూ ఎమోషనల్ అయ్యాడు.రాజమౌళి చేసిన పోస్ట్ ఏంటంటే.. 'జపాన్ లో ఓరిగామీ క్రేన్స్ ని తయారు చేస్తారు. వాటిని తమకు కావాల్సిన వారికి, అభిమానించే వారికి బహూకరిస్తారు. వాటి ద్వారా వాళ్లు ఆరోగ్యంగా, ఆందంగా ఉండాలి అని కోరుకుంటారు. ఈ 83 ఏళ్ల మహిళ మాకోసం అలాంటివి 1000 చేసింది. ఎందుకంటే ఆమెకు ఆర్ఆర్ఆర్ సంతోషాన్ని ఇచ్చింది. వాటిని మాకు పంపి ఆమె మాత్రం బయట చలిలోనే ఉండిపోయింది. కొందరి అభిమానానికి వెల కట్టలేం. జస్ట్ గ్రేట్ ఫుల్' అంటూ రాజమౌళి క్యాప్షన్ ఇచ్చాడు. ఆమెను లోపలికి పిలిపించి ఆమెతో ఫొటో కూడా దిగారు. అలాగే రమా రాజమౌళిని కూడా ఆ మహిళ కలిసింది. వారితో ఫొటోలు దిగింది. వారికి తాను తయారు చేసిన ఓరిగామిలను స్వయంగా అందించింది.

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాజమౌళికి దక్కిన సర్ ప్రైజ్ పై నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ రేంజ్ ని ప్రపంచవ్యాప్తం చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పనిలోపని మహేశ్- రాజమౌళి కాంబో గురించి ఏదైనా అప్ డేట్ ఇవ్వండి అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు. రాజమౌళి ఇటీవల ఓ సందర్భంలో మహేశ్ ప్రాజెక్ట్ ని త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రాజెక్ట్ రూ.1000 కోట్ల బడ్జెట్ తో రాబోతోంది అని చెప్తున్నారు. అలాగే వరల్డ్ వైడ్ కాన్సెప్ట్ తో వస్తోందని చెప్తున్నారు. మరి.. రాజమౌళికి జపాన్ మహిళ ఇచ్చిన గిఫ్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయంప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాజమౌళి కోసం, ఒక తెలుగు సినిమాపై ఆమె పెంచుకున్న అభిమానం చూసి తెలుగు ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజమౌళిపై ఈ బామ చూపించిన అభిమానం చూసి ఆయన ఫ్యాన్స్ అంతా ముచ్చటపడుతున్నారు. కాగా rrr జపనీస్ భాషలో విడుదలై ఏడాది పూర్తైన సందర్భంగా అక్కడి థియేటర్లలో ఈ మూవీ స్పెషల్ షో లను వేశారు. దీంతో జక్కన తన భార్య రమ, ఇతర కుటుంబసభ్యులతో కలిసి ఆయన జపాన్ వెళ్లారు. టోక్యోలో rrr స్పెషల్ షోలు వేస్తున్న థియేటర్లలో ఆయన కుటుంబంతో కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ షూటింగ్ విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను జపాన్ ఆడియన్స్తో పంచుకున్నారు. అంతేకాదు షూటింగ్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తనకున్న ఫన్నీ ఎక్స్ పీరియన్సెను షేర్ చేసుకున్నారు.అల్రెడీ విడుదలైన సినిమాను కూడా మళ్లీ థీయేటర్లో ఇంతగా ఆదిరిస్తున్న జపాన్ ప్రేక్షకులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాలు తెలిపారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమురం భీం పాత్రలో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటనకు భారతీయ ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ ప్రేక్షకులు సైతం సర్ప్రైజ్ అయయారు. ముఖ్యంలో ఈ సినిమాలోని 'నాటు నాటు...' పాటలో వేసిన స్టెప్పులు, కొరియోగ్రఫీకి హాలీవుడ్ దిగ్గజాలు సైతం ఫిదా అయ్యారు. ఇక ఈ మూవీ ఆస్కార్ గెలవడంతో నాటు నాటు క్రేజ్ ఇంటర్నేషనల్ వేదికలపై మారుమోగింది. ఇప్పటికీ ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు స్టెప్పులేస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు పాన్ వరల్డ్ చిత్రం SSMB29 సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్పైకి రానున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: