టాలీవుడ్ కింగ్ నాగార్జున కొడుకు గా సిని ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు అక్కినేని నాగచైతన్య. ఎప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఇప్పడి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ స్టార్ హీరో మాత్రం అవ్వలేకపోయాడు. ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఆయన నటించిన సినిమాల్లో చాలావరకు సినిమాలన్నీ ఫ్లాప్ లుగా మారాయి. కొన్ని మాత్రమే హిట్ సినిమాలుగా నిలిచాయి. ఆ హిట్ కూడా నాగచైతన్య ఖాతాలో పడలేదు. ఎందుకంటే స్టోరీ బాగుండడమో లేకపోతే హీరోయిన్స్ సినిమాకి ప్లస్ అవ్వడం వల్ల ఆ సినిమాలు హిట్ అందుకున్నాయి. 

ఈ క్రమంలోనే నాగచైతన్య కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  నాగచైతన్యతో కోట్లు ఇచ్చినా సరే నటించను అంటూ ఒక హీరోయిన్ తెగ్గేసి చెప్పేసిందట. ఆమె మరి ఎవరో కాదు స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్. ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. నాగచైతన్యతో నటించే ఛాన్స్ వచ్చిన రిజెక్ట్ చేసిందట. నాగచైతన్య కస్టడీ సినిమాలో విలన్ షేడ్స్ పాత్రలో ఆమెని అనుకున్నారట. కానీ ఆయనతో నేను నటించను 

అంటూ తగ్గేసి చెప్పేస్తుందట. దానికి కారణం హీరోయిన్ సమంత అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. సమంత టాలీవుడ్ కింగ్ నాగార్జున కొడుకు  నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది హీరోయిన్స్ కూడా నాగచైతన్యతో నటించము అంటూ ఓపెన్ గానే చెప్పేశారు. అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నాగచైతన్య లేటెస్ట్ సినిమాల విషయానికి వస్తే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున కొడుకు నాగచైతన్య కి జోడిగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: