తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుని క్యారెక్టర్ ఆర్టిస్టు స్టేజ్ నుంచి స్టార్ హీరోగా ఎదిగింది చాలా తక్కువ మందే. అలాంటి వారిలో మొదటి వరుసలో మెగాస్టార్ చిరంజీవి ఉంటారు అని చెప్పాలి. స్వయంకృషితో ఆయన ఇండస్ట్రీకి మెగాస్టార్ గా మారిపోయారు. అయితే చిరంజీవి తర్వాత ఇలా స్వయంకృషితో ఎదిగింది రవితేజ. ఏకంగా చిన్నచితక పాత్రలు చేసుకుంటూ వచ్చిన రవితేజ.. ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.



 అయితే రవితేజకు మంచి గుర్తింపు రావడానికి స్టార్ హీరోగా ఎదగడానికి కామెడీ ట్రాక్ కారణం అని చెప్పాలి. ఏ కమెడియన్ లో లేనంత కామెడీ టైమింగ్ రవితేజ లో ఉంటుంది. ఇక ఆయన డైలాగ్ డెలివరీ కూడా అదే విధంగా ఉంటుంది.  రవితేజ ఏదైనా కామెడీ డైలాగ్ చెప్పాడు అంటే  ప్రేక్షకుల పొట్ట చెప్పినవ్వాల్సిందే. ఇక కిక్ సహా అంతకుముందు సినిమాలలో అన్నింటిలో కూడా ఇలాంటిది ప్రేక్షకులు చూశారు. కానీ గత కొంతకాలం నుంచి రవితేజ కామెడీ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇక చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ కామెడీ ట్రాక్ ఉన్న కథను రవితేజ ఎంచుకోబోతున్నాడట.



 అయితే ప్రస్తుతం రవితేజ కామెడీ ట్రాక్ ని పక్కన పెట్టి యాక్షన్ మూవీస్ చేస్తున్న పెద్దగా హిట్టు మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఇక అభిమానులు కూడా రవితేజకు బాగా కలిసి వచ్చిన కామెడీ ట్రాక్ తో మళ్లీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు. దీంతో రవితేజ ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇలాంటి కథను చేసేందుకు ఒప్పుకున్నాడట రవితేజ. సామజ వర గమన కథ రచయిత అయిన భాను భోగ వరపు ఒక ఎంటర్టైన్మెంట్ కథ వినిపించగా రవితేజకు బాగా నచ్చిందట. ఇక ఈ సినిమాతో ఆయనను డైరెక్టర్ గా పరిచయం చేయాలని కూడా అనుకుంటున్నాడట రవితేజ.

మరింత సమాచారం తెలుసుకోండి: