
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలలో డిజాస్టర్ అయిన కూడా కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సినిమా ఖలేజా. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు - అనుష్క జంటగా తెరకెక్కిన ఈ సినిమా 2010 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు నటించిన ఈ డిజాస్టర్ అంటే కేవలం మహేష్ అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులు కూడా ఇప్పటికీ వేలం వెర్రి గా చూస్తారు .. ఎందుకో కానీ 15 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. 2007 చివరలో అతిధి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఆ సినిమా ప్లాప్ అవడంతో మూడున్నర సంవత్సరాల పాటు సినిమాలు చేయలేదు. ఆ తర్వాత ఖలేజా సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
మహేష్ బాబును ప్రేక్షకులు తమ కోరుకున్న దానికంటే భిన్నంగా తెర మీద చూడటం చాలా మందికి నచ్చలేదు. అలాగే ఈ సినిమాకి పోటీగా ఎన్టీఆర్ బృందావనంతో పాటు . . రజనీకాంత్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన రోబో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఖలేజా అంచనాలు అందుకోకపోవడం దీనికి తోడు బృందావనం , రోబో సూపర్ డూపర్ హిట్ అవడంతో ప్రేక్షకులు ఖలేజా సినిమా ను పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత ఖలేజా సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందుకే బుల్లితెర మీద ఈ సినిమా ఎప్పుడు ప్రసారమైన కూడా ఎంతో ఆసక్తితో చూస్తారు. అందుకే ఎన్ని సార్లు ఖలేజా టీవీ లలో వచ్చినా కూడా అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటుంది.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు