ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.ఇలాంటి సమయంలోనే హరిహర వీరమల్లు చిత్రాన్ని అడ్డుకునేందుకు ఒక కుట్ర జరుగుతోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలకు మరింత బీజం వేశారు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్.. హరిహర వీరమల్లు చిత్రాన్ని కొంతమంది టార్గెట్ చేశారని ఒక న్యూస్ చానల్లో డెబిట్ లో కూర్చున్న నట్టి కుమార్ పలు విషయాలను తెలియజేశారు. ముఖ్యంగా నిర్మాత కూడా నష్టాలలో ఉన్నారని.. ఇప్పటికే ఆయన మీద చాలా ప్రెషర్ ఉందని..పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందని తెలిసి కూడా జూన్ 1న సినిమా హాళ్లు బందు చేస్తామంటూ ప్రకటించారు అంటూ నట్టి కుమార్ ఆరోపణలు చేస్తున్నారు.


పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా దెబ్బ తీయాలని వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తో పాటుగా కొంతమంది నిర్మాతలలో (అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్) కుట్ర చేశారన్నట్లుగా తెలియజేస్తున్నారు. అయితే ఇన్ని రోజులు లేనిది ఇప్పటికిప్పుడు థియేటర్లు బంద్ చేయవలసిన పరిస్థితి ఏమొచ్చింది అంటు నట్టి కుమార్ ఆరోపిస్తున్నారు. ఈ కుట్రలో వైసీపీ పార్టీ హస్తం ఉందని తెలియజేస్తున్నారు. గతంలో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇదే తరహాలోనే కుట్ర జరిగింది అంటూ తెలియజేశారు.


మరొకవైపు సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిక్యూటర్లు తీసుకున్న ఈ నిర్ణయం పైన వెనక ఎవరేరున్నారనే విషయాన్ని తెలుసుకోవాలంటూ మంత్రి కందుల దుర్గేష్ కూడా హోం శాఖకు పలు రకాల ఆదేశాలను కూడా జారీ చేశారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ పైన నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ కూడా ఫైర్ అయ్యారు.. సినీ ఇండస్ట్రీకి కూటమి ప్రభుత్వం ఎంతో మేలు చేస్తే తమకు ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా ఇకమీదట ఎలాంటి  చర్చలు జరిపేది లేదంటే డైరెక్ట్ గానే వార్నింగ్ ఇచ్చేశారు. మరి వైసీపీ నేతలు ఈ విషయం పైన ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: