
పోనీలే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లే అని అందరు సైలెంట్ అయిపోయారు. మళ్లీ వీళ్ల కాంబోలో సినిమా వస్తుందిలే అని ఆశలు పెట్టుకున్నారు. కానీ అసలుకే బయటపడిన మేటర్ ఏంటంటే వీళ్ళ కాంబోలో సినిమా టోటల్గా క్యాన్సిల్ అయిపోయింది . త్రివిక్రమ్ అల్లుఅర్జున్ కోసం రాసుకున్న కథతో ఇప్పుడు ఎన్టీఆర్ ను చూపించబోతున్నాడు అంటూ తాజాగా బయటపడింది . నిజానికి అలా వైకుంఠపురం లో తర్వాత త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమాకి ఫిక్స్ అయి ఉన్నారట .
కానీ కొన్ని కారణాల చేత ఇది హోల్డ్ లో పడింది . మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబో సెట్ అయింది అంటూ టాక్ వినిపిస్తుంది. అయితే ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ఈ రేస్ లో ఉన్నట్లు బాగా వార్తలు వినిపిస్తున్నాయ్. కుదిరితే ఎన్టీఆర్ లేదంటే రామ్ చరణ్ కచ్చితంగా ఈ ఇద్దరితో మాత్రం త్రివిక్రమ్ సినిమా ఉంటుంది అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . ఇలాంటి మూమెంట్లోనే ఊహించని హీరో పేరు తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్ ఇప్పటివరకు ప్రభాస్ తో ఒక్క సినిమా కూడా తెరకెక్కించలేదు .
వీళ్ళ కాంబోలో సినిమా రావాలి అంటూ ఎప్పటినుంచో ఫాన్స్ వెయిటింగ్ . త్రివిక్రమ్ - చరణ్ కాంబోలో కూడా సినిమా రాలేదు. కానీ ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేసే కాంబో మాత్రం ప్రభాస్ - త్రివిక్రమ్ . త్రివిక్రమ్ - చరణ్ - ఎన్టీఆర్ తో కాకుండా ప్రభాస్ తో సినిమాను తెరకెక్కిస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు . ఆల్రెడీ అల్లు అర్జున్ తో సినిమాకి కమిట్ అయినట్లే అయ్యి వెనక్కి వచ్చేసాడు త్రివిక్రమ్ . అంతే కాదు ఎన్టీఆర్ తో సినిమా అంటూ పరోక్షకంగా బిగ్ బాంబ్ కూడా పేల్చేసాడు. ఒకవేళ ఇది కూడా క్యాన్సిల్ అయ్యి ఆ ప్లేస్ లోకి ప్రభాస్ వస్తే మాత్రం ఇక సినిమా ఇండస్ట్రీలో ఇదే బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . చూద్దాం మరి త్రివిక్రమ్ ఏం చేస్తాడో..? ఆయన అనుకున్న డ్రీమ్ ప్రాజెక్టులో కీలక పాత్రలో మెరిసే ఛాన్స్ ఎవరికీ ఇస్తాడు అనేది..??