టాలీవుడ్ లో పలు చిత్రాలలో వేశ్యపాత్రలలో నటించి పేరు సంపాదించిన నటి రమ్యశ్రీ గురించి చెప్పాల్సిన పనిలేదు..అయితే తాజాగా రమ్యశ్రీ, తన  సోదరుడి పై దాడి చేసిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారుతోంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే కత్తులు, బ్యాట్లతో తన పైన దాడి చేశారంటూ రమ్యశ్రీ హైదరాబాదులో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.. FCI కాలనీలో  లే అవుట్లో రోడ్డు మార్కింగ్ చేస్తున్నటువంటి హైడ్రా, ఫ్లాట్ ఓనర్స్ సమక్షంలో(రమ్యశ్రీ) ఈ పనులు జరుగుతూ ఉండగా.. ప్రముఖ సంధ్యా కన్స్ట్రక్షన్ ఓనర్ అయిన శ్రీధర్ రావు అనుచరులు దాడి చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


రమ్యశ్రీ తన సోదరుడు ప్రశాంత్ పైన తన మీద కత్తులతో బ్యాట్లతో శ్రీధర్ రావు అనుచరులు దాడి చేసినట్లుగా ఆమె వెల్లడించింది .ఈ క్రమంలోనే తమకు గాయాలయ్యాయని రమ్యశ్రీ, సోదరుడు ప్రశాంత్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పట్ట పగలే ఇలాంటి అత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారంటూ ఆమె ఆవేదనను తెలియజేస్తూ కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం. శ్రీధర్ రావు చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్టు వేసేలా చర్యలు తీసుకోవాలంటు పోలీసులను కోరింది రమ్యశ్రీ.


రమ్యశ్రీ తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించింది ఇమే ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రలలోనే నటించింది. 2019లో బాబాల బాగోతం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత సరదాగా కాసేపు, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, రాఘవ, నువ్వు నేను, రాజకుమారుడు, ఆది తదితర చిత్రాలలో నటించింది. అలాగే కన్నడ, హిందీ, భోజ్ పురి వంటి భాషలలో కూడా నటించింది రమ్యశ్రీ. వాస్తవానికి ఇమే అసలు పేరు సుజాత.కానీ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు తన పేరును మార్చుకున్నట్లు తెలుస్తోంది. మరి తన పైన జరిగిన ఈ దాడి పై ఎలా స్పందిస్తుందో చూడాలి రా మేస్త్రి

మరింత సమాచారం తెలుసుకోండి: