
జూలై 10న రీరిలీజ్ కానున్న మరో చిత్రం `కుమారి 21ఎఫ్`. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 2015లో విడుదలైన సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అలాగే జూలై 11న మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ `మిరపకాయ్` చిత్రం రీరిలీజ్ కాబోతుంది.
నాగచైతన్య, సమంత తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం `ఏ మాయ చేశావే`. 2010లో వచ్చిన క్లాసిక్ హిట్ గా నిలిచిన ఈ సినిమా జూలై 18న మళ్లీ విడుదల కానుంది. అదే రోజు సూర్య సూపర్ హిట్ మూవీ `గజిని` మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయింది. జూలై 19న సూర్య, తమన్నా కలిసి నటించిన `వీడొక్కడే` సినిమా రీ రిలీజ్ కానుంది. ఈ చిత్రాలకు ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. మరి రీరిలీజ్ లో ఈ చిత్రాలు ఎటువంటి రెస్పాన్స్ ను అందుకుంటాయో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు