యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్నది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. బాహుబలి తరువాత చేస్తున్న సినిమా కావడంతో పాటు దీనిని పాన్ ఇండియా మూవీగా, ఇండియన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ సొంతంగా హిందీ డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. దీనిద్వారానే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
దీనితో పాటు సైమల్టేనియస్ గా ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. వింటేజ్ మూవీగా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది.
ఇదిలా ఉంటె, ప్రభాస్ కు సంబంధించిన ఓ న్యూస్ మీడియాలో నిన్న ఉదయం నుంచి ట్రెండ్ అవుతున్నది. ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు న్యూస్ ఛానల్ పెడుతున్నారని, ఆ ఛానల్ ప్రభాస్ చేతులమీదుగా ప్రారంభం కాబోతున్నదని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలి. ఇక సాహో సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.