జులాయి, సన్నాఫ్ సత్యమూర్తిలాంటి హిట్ సినిమాల తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. స్టూడెంట్ నెంబర్ 1 , సింహాద్రి, యమదొంగలాంటి హిట్ సినిమాల తరువాత ఎన్టీయార్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలు పూర్తయిన తరువాత కెరీర్లో గ్యాప్ రాకుండా ఈ ఇద్దరు హీరోలు జాగ్రత్త పడుతున్నారు. సంవత్సరానికి కనీసం ఒకటి లేదా రెండు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. 
 
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడు. సుకుమార్ సినిమాతో పాటు దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 2020 నుండి మరో సినిమా మొదలుపెట్టబోతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా అల్లు అర్జున్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. నా పేరు సూర్య సినిమా తరువాత సంవత్సరం పాటు ఖాళీగా ఉన్న అల్లు అర్జున్ ఇక ముందు కెరీర్లో గ్యాప్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 
 
యంగ్ టైగర్ ఎన్టీయార్ కూడా స్టార్ డైరెక్టర్లతో వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీయార్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడని తెలుస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎన్టీయార్ కూడా కెరీర్లో గ్యాప్ రాకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. 
 
ప్రభాస్ సాహో సినిమా తరువాత జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటించబోతున్నాడు. మహేశ్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నాడు. మహేశ్ బాబు, రామ్ చరణ్ కొత్త సినిమాలకు ఇంకా కమిట్ అవ్వాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: