తెలుగు చలన చిత్ర రంగంలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాన్.  మెగాస్టార్ రాజకీయాల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాన్ కి మంచి క్రేజ్ వచ్చింది.  ముఖ్యంగా జల్సా, గబ్బర్ సింగ్,అత్తారింటికి దారేది చిత్రాలతో మాస్ ఇమేజ్ బాగా సొంతం చేసుకున్నారు.  ఆ తర్వాత జనసేన పార్టీ పెట్టి తెలుగు రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరయ్యారు.  
Image result for pawan keerthi suresh anu emmanuel
తాజాగా పవన్ కళ్యాన్ ఆప్త మిత్రుడు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్నారు.  ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేశాయి.  అయితే ఆ చిత్రాల్లో కాస్త సీరియస్ కాంటెంట్ ఉన్నా మద్య మద్యలో పవన్ కామెడీతో ఇరగదీశారు.  తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే చిత్రంలో సీరియస్ పాయింట్‌ని కామెడీ టచ్‌తో చెబుతున్నాడట.    
Image result for pawan keerthi suresh anu emmanuel
త్రివిక్రమ్ రొమాన్స్, కామెడీ, యాక్షన్ కలగలిపి మూవీని తెరకెక్కిస్తున్నాడట.  ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి  షూటింగ్ కంటిన్యూగా జరుగుతోంది. ఈ మూవీ మీద సినీ జనాలకి భారీ అంచనాలే వున్నాయి.   ఇక ఈ మూవీలో పవన్‌తో ఫస్ట్ టైం కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ జత కడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: