సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి  సుధీర్ బాబు ‘ఎస్ఎంఎస్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  తర్వాత వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ తప్ప ఏదీ పెద్దగా పేరు తీసుకు రాలేదు.   కానీ హీరోగా తనను తాను ప్రూఫ్ చేసుకోవడానికి తెగ కష్టపడుతున్నాడు సుధీర్ బాబు.  ఆ మద్య బాలీవుడ్ లో భాగీ చిత్రంలో విలన్ గా కూడా నటించాడు. 

ఈ మద్య రిలీజ్ అయిన‘స‌మ్మెహ‌నం’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసుకున్న సుధీర్ బాబు హీరోగా సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువ‌టే.  ఇక ‘నన్ను దోచుకుందువ‌టే’ఫస్ట్ లుక్ మరోసారి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నాయి.

నభా నటేశ్ ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో జూలై 14న 10:02 ని.ల‌కు టీజ‌ర్ ని విడుద‌ల చేస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసి త్వరలో విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు చిత్రయూనిట్.  


మరింత సమాచారం తెలుసుకోండి: