కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూపులు చూసిన హీరో రామ్ మరియు దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఇటీవల వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ సక్సెస్ సాధించిన అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తూ ఉండడం అమితమైన ఆనందాన్ని ఇస్తోంది. ఇక ఈ సినిమాతో వారిద్దరూ మళ్ళి ఫామ్ లోకి రావడంతో, అటు రామ్ కు, ఇటు పూరికి టాలీవుడ్ నుండి మంచి ఆఫర్లు వస్తున్నాయట. 

పూరి మార్క్ టేకింగ్, స్క్రీన్ ప్లే, అలానే రామ్ నటన, డైలాగులు, మాస్ యాక్షన్ ఫైట్స్, డాన్స్ మరియు ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు వెరసి ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సూపర్ హిట్ టాక్ ను కట్టబెట్టాయి. అయితే వాస్తవానికి ఈ సినిమా కథను పూరి మొదట, ఒక మెగా హీరోకు వినిపించాలని అనుకున్నారట. అతడు మరెవరో కాదు సుప్రీమ్ హీరోగా పేరుగాంచిన సాయి ధరమ్ తేజ్ అట. అయితే అప్పటికే వరుసగా ఆరు ఫ్లాపులు చవిచూసిన సాయి తేజ్, మరోవైపు ఫ్లాప్స్ తో కొట్టుమిట్టాడుతున్న పూరి కథ వినడానికి సుముఖత చూపలేదట. 

దానితో ఆ కథను పూరి, రామ్ కు చెప్పడం, చివరకు అది ఇస్మార్ట్ శంకర్ సినిమా రూపంలో చిత్రీకరించించబడి, ఇంతటి విజయాన్ని అందుకోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా సూపర్బ్ టాక్ మరియు కలెక్షన్స్ తో దూసుకుపోతుండడంతో, సాయి తేజ్ లోలోపల కొంత మధనపడుతూ ఈ సినిమా విషయమై జరిగిన విషయాన్ని తన సన్నిహితులకు చెప్పుకుని కొంత ఫీల్ అవుతున్నాడని ఫిలిం నగర్ టాక్. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు మాత్రం తెలియాల్సి ఉంది..... !! 


మరింత సమాచారం తెలుసుకోండి: