స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అల.. వైకుంఠపురములో .. షూటింగ్ తుది దశకు చేరుకుంది. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తికానుంది. ఇక ఈ చిత్రం నుండి ఈ రోజు సాయంత్రం 6:03గంటలకు మొదటి సాంగ్ విడుదలకానుందని సమాచారం. ఫ్యాన్స్ ను ఈ సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటుందని సమాచారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను భారీ ధరకు జెమిని టీవి సొంతం చేసుకోగా ఓవర్సీస్ హక్కులను బ్లూ స్కై సినిమాస్ 8.60కోట్లకు సొంతం చేసుకుంది. తద్వారా ఈచిత్రం అల్లు అర్జున్ కెరీర్ లో ఓవర్సీస్ లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రం గా రికార్డు సృష్టించింది.
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బన్నీ కి జోడిగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా టబు , జయరాం , మురళి శర్మ , నవదీప్ , సుశాంత్ , నివేత పేతురేజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 ఈ చిత్రం విడుదలకానుంది. ఈచిత్రం తరువాత అల్లు అర్జున్ , సుకుమార్ తో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. మైత్రి మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ prasad NUVVILAA' target='_blank' title='click here to read more about prasad NUVVILAA'>ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అక్టోబర్ లో మొదటివారంలో ఈచిత్రం లాంచ్ కానుంది.