టీడీపీ నేతలు మాటలు వింటుంటే వీరు ఇక మారరా అని సందేహాలు రాక మానదు. మాటలు మార్చి మాట్లాడటంలో వీరి తరువాతే ఎవరైనా... ప్రజల దగ్గర అడ్డంగా బుక్ అయినా మేము చెప్పిందే నిజం అన్నట్టు ఉంటుంది వీరి యవ్వారం. జగన్ సతీమణి భారతిపై ఈడీ కేసులో టీడీపీకి సంబంధం ఏంటని యనమల ప్రశ్నించడం జనానికి నవ్వు తెప్పిస్తోంది. ఈడీ రిపోర్టు జడ్జి దగ్గరికి కూడా చేరకనే ఎల్లోమీడియాకు అందింది. సీఎం చంద్రబాబుకు కోర్టుల కంటే తనను మోసే పత్రికలపైన్నే ప్రగాఢ నమ్మకం ఉన్నట్టుంది. ఈడీ రిపోర్టును లీక్ చేయడం వెనుక బాబు వ్యూహం పక్కా.
కోర్టులో భారతి దోషి లేదా నిర్దోషి అని తేలేందుకు సంవత్సరాలు పడుతుందని, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సత్వర ప్రయోజనాలు దక్కాలంటే ప్రజాక్షేత్రంలో జగన్ను దోషిగా నిలబెట్టే ఎత్తుగడలో భాగమే ఎల్లో పతాక శీర్షిక వార్తలు. ఏకంగా భారతిని ముద్దాయిగా కూడా ఎల్లో పత్రికా కోర్టు తేల్చింది. ఈ విషయమై జగన్ రాసిన బహిరంగ లేఖ యనమలకు విచిత్రంగా కనిపిస్తోందట మరి. కేసులో కుటుంబ ప్రమేయం ఉందో లేదో జగన్ స్పష్టం చేయాలట.
ఈడీ చార్జ్షీట్కు బీజేపీకి సంబంధం లేదు. ఈడీ చార్జ్షీట్కు మోడీ సర్కార్కు సంబంధం లేదు. ఈడీ చార్జ్షీట్కు, ఎల్లో మీడియాకు అసలే సంబంధం లేదు. ఇదంతా జగనే కావలని ఎల్లోమీడియాకు లీక్లు ఇచ్చారు. లేదంటే వారికి ఎలా తెలుస్తుంది. ఈడీ కేసుల వ్యవహారం జగన్కు తప్ప మరెవరికి తెలిసే అవకాశం లేదు. అందువల్లే జగనే ఈ పనికి పాల్పడ్డాడు.ఇలా ఉంటుంది టీడీపీ నాయకులా వ్యవహారం...!