వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విధంగా ప్రతిపక్షాన్ని, ఆ నేతలని విమర్శిస్తూ తన రాజ్యాన్ని కాపాడుకుంటున్నాడు విజయసాయి రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి చంద్రన్నను టార్గెట్ చేస్తూ ట్విట్లు చెయ్యడం వల్ల విజయసాయి రెడ్డికి పార్టీలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును అతని సుపుత్రుడు నారా లోకేష్ ని ఉద్దేశిస్తూ సంచలన ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ చుసిన నెటిజన్లు 'ఛీ.. ఛీ చంద్రబాబు అంటూ విరుచుకుపడుతున్నారు.' మరికొందరు స్పందిస్తూ 'నారా లోకేష్ అన్న క్యాంటిన్లు మూసేసారు అని తెగ డైలాగ్ లు వేశావు. ఇప్పుడు ఈ 53 కోట్ల గురించి కొంచం చెప్తావా ? అంటూ ట్విట్ చేస్తున్నారు. ఇంకా మరి కొందరు అయితే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పై విరుచుకు పడుతున్నారు. 


ఈ నారా కుటుంబానికి అన్ని కావాలి.. మీకు ఏం కావాలో రాసుకోండి అని అంటే ఆంధ్ర రాష్ట్రన్ని మొత్తం వాళ్ళ పేరున రాసేసుకుంటారు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. అయితే నారా లోకేష్, చంద్రబాబు నాయుడుపై నెటిజన్లకు ఇంత కోపాన్ని తెప్పించిన ట్విట్ ఏంటి అని అనుకుంటున్నారా ? ఇంకే ట్విట్ అండి. విజయసాయి రెడ్డి పెట్టిన సంచలన ట్విట్ ఏ కారణం. 


విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ 'పేదల అన్నం ముద్దలో కూడా తండ్రి, కొడుకులు కమిషన్లు తిన్నారు. 203 అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ.53 కోట్ల అవినీతి జరిగినట్టు విచారణలో తేలింది. 2 కాంట్రాక్టు సంస్థలతో వాటాలు మాట్లాడుకొని వాటికే పనులు దక్కేలా టెండర్లు రూపొందించారు. చ.అడుగుకు రూ 4,500 ఖర్చవుతుందా చంద్రబాబు నాయుడు గారూ? నారా లోకేష్' అంటూ ట్విట్ చేశాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: