ఇప్పటిదాకా ఎవ్వరు ఇల చేసుండరు కానీ  ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన విద్యుత్‌ శాఖ ఉద్యోగులు ప్రతిరోజూ హెల్మెట్‌ ధరించే ఆఫీసుకు వెళ్తారు. వీరు భయం తో పెడుతున్నారు అనుకుంటే పొరపాటు ,  అంతేకాదు కార్యాలయానికి చేరుకున్న తర్వాత కూడా హెల్మెట్‌ పక్కన పెట్టకుండానే పనిచేసుకుంటారు. కేంద్ర సర్కారు ప్రవేశపెట్టిన మోటార్‌ వాహన సవరణ చట్టం-2019 మీద ఉన్న భయం వలనో, భక్తి వలనో వీరిలా చేస్తున్నారనుకుంటే పొరపాటే . ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే పడే జరిమానాల నుంచి తప్పించుకునేందుకు వారు ఇలా చేయడం లేదు.

పనిచేసే చోట ప్రాణభయంతో వుంటున్నారు అంటే ఎక్కడ ప్రాణాలు కోల్పోతాయి అనే భయంతో  వేరే గత్యంతరంలేక ఈ మార్గం ఎంచుకున్నారు. ఇంతకీ అస్సలు విషయం ఏమిటంటే... విద్యుత్‌ శాఖకు చెందిన బాందా జిల్లాలోని ఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. కప్పు ఎప్పుడు ఊడి మీద పడుతుందో అని భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పని చేస్తున్నాం . కాస్త వర్షం పడినా  సరే పైనుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఉద్యోగులే ఈ ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకున్నారు.

కాగా హెల్మెట్లు ధరించి ఆఫీసులో పనిచేసుకుంటున్న ఉద్యోగుల ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..
దీని  గురించి విద్యుత్‌ ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ... ‘ మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఇంకోమార్గం  లేక ఇలా హెల్మెట్‌తో కాలం గడుపుకొస్తున్నాము .

ఇక్కడ మాకు కనీస సౌకర్యాలు లేవు. సరైన అల్మారాలు కూడా ఫైళ్లు భద్రపరుచుకునేందుకు  లేవు. కుర్చీలు కూడా చిరిగిపోయి ఉన్నాయి. వర్షం వస్తే గొడుగులు పట్టుకుని పనిచేస్తాం. ఇంతా జరుగుతున్నా సీనియర్లకు మా బాధలు పట్టవు. కప్పు కూలి మాలో ఎవరో ఒకరు చచ్చిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం వెదుకుదామని వాళ్లు ఆలోచిస్తున్నారేమో. అప్పుడే భవనాన్ని రిపేరు చేస్తారు కావొచ్చు అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ విషయంపై ఉన్నతాధికారులు ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: