చికిత్స నిమిత్తం బయటకు వెళ్లిన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేశారు ఆ నీచులు. అయితే ఆ నీచులను కేవలం 24 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. అయితే వారిని కోర్టులో హాజరుపరచగా ఆ నిందితులను 14రోజులు రిమాండ్ లో ఉంచాలని ఆదేశించారు. 

              

అయితే ఆ నీచులను సిన్ రికర్రెక్షన్ కోసం ఘటన స్థలంలోకి తీసుకురాగా ఆ సమయంలో ఆ నిందితులు పారిపోవాలని చూసి పోలీసులపై దాడి చెయ్యడం వల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు నలుగురు ఈ నెల 6వ తేదీన తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు మృతిచెందారు. అయితే ఆరోజు దేశవ్యాప్తంగా ప్రజలు అందరూ సంబరాలు చేసుకున్నారు. 

                

కాగా ఈ ఎన్కౌంటర్ పై విచారణ జరపాలని హైకోర్టులో మహిళా, పౌరహక్కుల సంఘాల నేతలు పిటిషన్ దాఖలు చెయ్యగా సోమవారం విచారణ జరిపిన కోర్టు మళ్ళి వాయిదా వేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు దిశ నిందితుల ఎన్కౌంటర్ పై సుప్రీం కోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యాయి. ఆ పిటిషన్ చూస్తే నిజంగా మీ రక్తం ఉడికిపోతుంది. 

 

అయితే ఇప్పటికే ఈ ఎన్కౌంటర్ ను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలు కాగా.. ఇవాళ కూడా మరో పిటిషన్ దాఖలైంది. దిశ నిందితులను ఎన్కౌంటర్ కి చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలను కోరుతూ సామజిక కార్యకర్త సంజయ్ పిటిషన్ వేయగా.. మిగితా పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్ సుప్రీం విహరించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: