భారతదేశంలో కరోనా  వైరస్ కోరల్లో చిక్కుకుని  ఎంతో మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఈ మహమ్మారి వైరస్ భారత ప్రజలను కూడా బెంబేలెత్తిస్తున్నది . ఇక ఈ కారణం వైరస్ ప్రభావం కేవలం మనుషులకే కాదు అన్ని రంగాలపైనా వ్యాపారాలపై  కూడా పడింది. ఈ మహమ్మారి వైరస్ తరిమికొట్టేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి అయినప్పటికీ మహమ్మారి వైరస్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. రోజురోజుకు ఈ వైరస్ విజృంభిస్తూనే ఉంది ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. 

 


 ఇకపోతే కరోనా వైరస్ కారణంగా పూర్తిగా చిత్రపరిశ్రమ మూత పడిన విషయం తెలిసిందే. విడుదల కాబోతున్న సినిమాలు విడుదల అయిన సినిమాలు విడుదల ఇంకా పట్టాలెక్కలేదు సినిమాలు. ఇలా చాలా సినిమాల్లో పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో హీరో హీరోయిన్లు దర్శకులు నిర్మాతల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సినీ కార్మికుల పరిస్థితి మాత్రం రోజురోజుకూ దిగజారిపోతోంది. ఉపాధి కరువవడంతో కనీసం ఇంటి అద్దె కట్టలేక తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నెలకొంది. దీంతో లాక్ డౌన్ సమయంలో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు సినీ కార్మికులు. అయితే చాలా మంది సినీ ప్రముఖులు ముందుకు వచ్చి సినీ కార్మికులకు సహాయం చేస్తూ మంచి మనసును  చాటుకుంటున్న విషయం తెలిసిందే. 

 


 ఈ క్రమంలోనే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా తన మంచి మనసు చాటుకున్నారు. మూడు లక్షల రూపాయలను సినీ కార్మికులకు హెల్త్ చేసేందుకు కోసం ఏర్పాటు చేసిన సీసీసి  కార్యక్రమానికి విరాళంగా ఇచ్చింది. అయితే కోట్లకు కోట్లు సంపాదిస్తున్న తమన్నాకి కేవలం కార్మికుల విషయానికి వస్తే మాత్రం చిన్న చూపు చూస్తూ కేవలం మూడు లక్షల ఇచ్చిందని కొంతమంది దీనిపై కామెంట్లు పెడుతున్నారు మరికొంతమంది గతంలో ఇచ్చిన రెండు లక్షల కంటే తమన్నా ఇచ్చిన మూడు లక్షల బెటర్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: