హర్యానా రాష్ట్రం లోని అంబాల నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగుల వినియోగం విషయం లో నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు నవంబరు 1వ తేదీన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగుల వినియోగం పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రజలందరూ ప్లాస్టిక్ నిషేధించడం పై అధికారులు అందరికీ అవగాహన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగుల ను దుకాణాల లో ఎక్కువగా వినియోగిస్తుంటారు అనే విషయం తెలిసిందే.
అయితే అధికారులు విధించిన నిబంధన ను ఉల్లంఘించి ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగుల వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు. వినియోగ దారులు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగుల ను తిరస్కరించాలంటూ సూచించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాలిథిన్ బ్యాగుల ను వినియోగిస్తే భారీ జరిమానాలు తప్పవు అంటూ అంబాల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు అందరూ తమకు సహకరించాల ని అంటూ ఈ సందర్భం గా అంబాల కార్పొరేషన్ అధికారులు కోరారు.