నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో జరిగాయి. టిడిపిని టార్గెట్ చేసుకుంటూ వైసీపీ వ్యవహరించిన తీరు సభలో నవ్వులు పువ్వులు పూయించాయి. పోలవరం ప్రాజెక్టు కు  సంబంధించి చర్చ జరిగిన సందర్భంలో,  ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు అని టిడిపి ఆరోపణలు చేస్తున్న తరుణంలో, ఏపీ సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు పై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పై చెప్పాల్సిందంతా చెప్పిన జగన్ ఈ సందర్భంగా చంద్రబాబు పై గతంలో టిడిపి కార్యకర్తలు పాడిన పాటను అసెంబ్లీ లో టెలికాస్ట్ చేయించారు. 



అందులోని  సన్నివేశాలు చూసి సభలోని సభ్యులందరూ పగలబడి నవ్వారు  ఆ వీడియో చూస్తున్నంత సేపు జగన్ సైతం నవ్వు ఆపుకోలేకపోయారు. చివరకు నవ్వలేక ఆ వీడియోను మధ్యలోనే ఆపి వేయించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పోలవరం సందర్శనకు వెళ్లిన కొంతమంది మహిళలు ఆ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసిన గొప్ప మనిషి చంద్రబాబు అని చెప్పే క్రమంలో జయము జయము చంద్రన్న అంటూ టిడిపి మహిళా కార్యకర్తలు పాడిన పాట తాలూక వీడియోను జగన్ సభలో ప్రచారం చేయించగా, ఆ వీడియో చూస్తూ జగన్, మిగతా ఎమ్మెల్యేలతోపాటు స్పీకర్ సైతం పగలబడి నవ్వారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఈ విధంగా పోలవరం పేరుతో 83 కోట్లకు పైగా ఖర్చు చేశారని చెప్పగా, అప్పట్లో ఇన్ని నేరాలు-ఘోరాలు జరిగాయి అన్నమాట అంటూ స్పీకర్ వ్యాఖ్యానించారు. 




ప్రస్తుతం అసెంబ్లీలో జరిగిన ఈ తతంగమంతా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. టిడిపి అధినేత చంద్రబాబు ను కామెడీ చేస్తూ నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారున్ జయము జయము చంద్రన్న అంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తూ, టిడిపి శ్రేణులను మరింత ఆటపట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: