ఆక్సిజన్ సరఫరా కోసం ప్రత్యేక రైలు ఏర్పాటైందని గుర్తు చేశారు.కరోనా మహమ్మారిపై అందరం యుద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ పరిస్థితి నుంచి అంతా బయటపడాలని అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు ఆయన సెల్యూట్ చేశారు. అందరం కలిసి ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవాలని అన్నారు. ఎంత కష్టం వచ్చినా ధైర్యం కోల్పోకూడదని.. ధైర్యంతో ముందుకు సాగాలని అన్నారు.దేశంలో కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా చూసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో లాక్డౌన్ అవసరం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోడీ..
చివరి అస్త్రంగానే లాక్డౌన్ ఉపయోగించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఈసారి కరోనాతో యుద్ధంలో యూత్ అంతా ముందుకు రావాలని అన్నారు. ఎక్కడిక్కడ యూత్ అందరూ కలిసి కమిటీలు వేసుకుని పరిస్థితిని సమీక్షించాలని అన్నారు. యువకులు ఈ రకంగా చేస్తే లాక్డౌన్ అవసరం లేదని.. కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయాల్సిన పనిలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అయితే అవసరం లేకుండా ఎవరూ బయటకు రాకుండా చూసుకోవాలని అన్నారు.అలాగే ఎవరికి వారు సొంతంగా జాగ్రత్తలు తీసుకొని బాధ్యతగా వుండాలని మోడీ చెప్పారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి