దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మీజిల్స్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఈ మీజిల్స్ ముంబై నగరంలో అయితే ఎంతో కలకలం సృష్టిస్తోంది. ఇక ఈ వ్యాధి కారణంగా ఎనిమిది నెలల చిన్నారి కూడా ఇటీవల మృతి చెందింది.దీంతో ఇప్పుడు ఈ వ్యాధితో మృతి చెందిన చిన్నారుల సంఖ్య మొత్తంగా 12కు చేరింది.ఇక పెరుగుతున్న కేసుల దృష్ట్యా కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ఇప్పుడు బాగా అప్రమత్తమైంది. బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ ఇంకా అలాగే మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణుల బృందాలను బాధిత రాష్ట్రాలకు పంపాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించడం జరిగింది. ఇక ఈ బృందాలు మీజిల్స్ నియంత్రణకు కార్యాచరణను రూపొందించి బాధిత రాష్ట్రాల్లో అనేక ప్రజారోగ్య చర్యలను చేపట్టనున్నాయి.ఇక మీజిల్స్ అనేది ఓ అంటు వ్యాధి.ఇది చిన్నపిల్లలకు, నవజాత శిశువులకు చాలా ప్రమాదకరం.ఇది ఎబోలా, ఫ్లూ లేదా కరోనా కంటే కూడా చాలా వేగంగా వ్యాపిస్తుంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గత సంవత్సరం ఈ విషయాన్ని హెచ్చరించింది.


2021 వ సంవత్సరం తో పోలిస్తే ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో కేసులు 79 శాతం పెరిగాయని UNICEF డేటా ద్వారా సమాచారం తెలుస్తోంది.ముంబై సిటీలో.. పౌర అధికారులు గత 24 గంటల్లో 3.04 లక్షల కుటుంబాలను పరీక్షించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ వ్యాధి చాలా వేగంగా వ్యాపిస్తున్నట్లు డేటా తెలిపింది.మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన డాక్టర్ తానాజీ సావంత్ మంగళవారం నాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు ఇంకా అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిపుణులతో సమావేశమయ్యారు.రాంచీ, అహ్మదాబాద్ ఇంకా అలాగే మలప్పురంలలో పిల్లలలో మీజిల్స్ కేసుల సంఖ్య పెరుగుదలను అంచనా వేయడానికి.. నివారణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి బృందాలను కూడా నియమించడం జరిగింది.ఈ మీజిల్స్ కేసులు ఎక్కువగా పెరుగుతున్న తీరును ఈ టీమ్స్ పరిశీలిస్తాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది.ఇవి వ్యాధిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ఆరోగ్య అధికారులకు సహాయం చేస్తాయి. ఈ మూడు నగరాల్లో పిల్లల్లో మీజిల్స్ కేసుల పెరుగుదల భారీగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: