సినీ రాజకీయ ప్రముఖుల యొక్క జాతకాలను సైతం ఎప్పుడు తెలియజేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా ఫేమస్ అవ్వడానికి ముఖ్య కారణం సమంత నాగచైతన్య వైవాహిక జీవితం లో విడాకుల వ్యవహారం చెప్పడం వల్లే అని చెప్పవచ్చు. ఆ తర్వాత నిహారిక విడాకులు, ప్రభాస్ సినిమాలు ప్లాపులు ఇలా సోషల్ మీడియాలో ఏదో ఒకటి వేణు స్వామి గురించి వైరల్ గా మారుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో రాజకీయ నాయకుల జాతకాలను కూడా చెబుతూ ఉంటారు వేణు స్వామి.


టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు 2023లో కొన్ని న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటారని చెప్పగా చెప్పినట్టుగానే స్కిల్స్ కామ్ లో అరెస్ట్ కావడం కూడా జరిగింది. అలాగే కవిత జాతకంలో కూడా జైలుకు వెళుతుందని చెప్పగా అది కూడా జరిగింది. ఇక ఏపీలో మరొకసారి సీఎం జగనేనంటూ ఎన్నో సందర్భాలలో వేణు స్వామి తెలియజేశారు.. ఇప్పుడు తాజగా వచ్చే ఎన్నికలలో అధికార పార్టీ ఎన్ని స్థానాలు విజయం అందుకుంటుంది అనే విషయం పైన వేణు స్వామి కుండలు బద్దలు కొడుతూ చెప్పేశారు. జగన్ సీఎం ప్రమాణస్వీకారం వచ్చే ఎన్నికలలో 35 సీట్లతో విజయం సాధించి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు.


అంతేకాకుండా 2029 లో కూడా  జగన్ గెలిచి హ్యాట్రిక్ రికార్డు సృష్టిస్తారని వేణుస్వామి క్లారిటీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో టిడిపి పార్టీ కూడా కనుమరుగవుతుందంటూ వెళ్ళాడు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉండడం చాలా తప్పు అని తన అన్నతో ఉంటేనే ఆమెకు విలువ ఉంటుందని షర్మిల రాజకీయాలు కలిసి రావని కూడా వేణు స్వామి వెల్లడించారు.. అయితే వైసిపి 135 సీట్లతో అధికారం వస్తుందని వేణు స్వామి చెప్పినప్పటికీ వైసీపీ శ్రేణులను కాస్త నిరాశ ఉంది. ఎందుకంటే తమ అధినేత 175 సీట్లు టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉంటే వేణు స్వామి 135 సీట్లు మాత్రమే విజయం సాధిస్తుందని చెప్పడంతో చాలామంది అభ్యంతరాలు తెలియజేస్తున్నారు. మరి వేణు స్వామి చెప్పినట్టుగా జరుగుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: