సినిమా సెలబ్రిటీలకు రాజకీయాలకు మంచి దగ్గర అనుబంధం ఉంటుంది.. ముఖ్యంగా చాలామంది గ్లామర్ ఫీల్డ్ తగ్గిన తర్వాత పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇస్తూ సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు.. మరి కొంతమంది ఏకంగా రాజకీయ పార్టీనే పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజకీయాలలో అందరు చూపు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు మాత్రమే ఉంది ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు కూడా ఈసారి రాజకీయాలలోకి బరిలో దిగే అవకాశం ఉన్నది. ఇప్పుడు తాజాగా అనసూయ కూడా రాజకీయాలలోకి రాబోతున్నట్లు వెల్లడించింది వాటి గురించి చూద్దాం.



అనసూయ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు మొదట బుల్లితెర యాంకర్ గా పేరు సంపాదించిన ఈమె ఆ తర్వాత వెండితెర పైన తనకంటూ ప్రత్యేకమైన పాత్రలలో నటించి గుర్తింపు సంపాదించుకుంది.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనసూయ రాజకీయాల పైన మాట్లాడుతూ.. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదు కానీ రాజకీయ పార్టీలు పిలిస్తే మాత్రం ప్రచారానికి వస్తానంటూ తెలిపింది.. తనకు నాయకులే ముఖ్యమని పార్టీలు కాదంటూ వెల్లడించింది అనసూయ.. ఈ నాయకుడు నచ్చితే ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తానని వారి యొక్క అజెండాలు నచ్చితే కచ్చితంగా వారికి మద్దతు అంటూ తెలియజేసింది అనసూయ.


కానీ రాజకీయాలలో ప్రజలు తన మాట వింటారా అనే విషయం పైన కూడా అనసూయ మాట్లాడుతూ.. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత తన మాట వినే వాళ్ళు ఉండడం నా అదృష్టమని..అయితే అలా వింటారని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడకూడదు కేవలం బాధ్యతగానే మాట్లాడాలని తెలిపింది. జనసేన పార్టీ లీడర్ తనను ప్రచారానికి పిలిస్తే వెళ్లడానికి తాను సిద్ధమే అని తెలిపింది అనసూయ. అలాగే రోజా నాగబాబు గారు ఇద్దరూ కూడా తనకు చాలా ఇష్టమని వారిద్దరూ పిలిచినా కూడా తప్పకుండా రెండు పార్టీలలోకి వెళతానని తన ఆసక్తిని బట్టి ఉంటుందంటూ వెల్లడించింది అనసూయ. అయితే ప్రచారానికి వెళ్లిన తర్వాత అన్నీ తెలుసుకొని వెళ్తానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: