ఒకే ఒక్క ఘటన వల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎయిర్ ఇండియా పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే. అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను మూడేళ్ళ క్రితం టాటా గ్రూప్ కొనుగోలు చేయగా ఈ సంస్థకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎయిర్ ఇండియాను ప్రపంచ శ్రేణి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని భావించిన ఎయిర్ ఇండియాకు తాజాగా జరిగిన డ్రీమ్ లైనర్ విమానం ప్రమాదం వల్ల కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

బాధిత కుటుంబాలకు ఎయిర్ ఇండియా అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  2022 జనవరిలో టాటా గ్రూప్  ఎయిర్ ఇండియాను తమ చేతుల్లోకి తీసుకుంది.  2023 సంవత్సరంలో ఒక ఘటన వాళ్ళ ఎయిరిండియాకు  30,000 డాలర్ల అపరాధ రుసుమును  డీజీసీఏ విధించింది.  2024 మార్చిలో  సైతం  డీజీసీఏ  ఎయిర్ ఇండియాకు 80 లక్షల రూపాయల  జరిమానా విధించడం జరిగింది.

కాశ్మీర్ అంశంపై ఉద్రిక్తతల సమయంలో  ఎయిర్ ఇండియాకు  అదనపు వ్యయాలు భారమయ్యాయని తెలుస్తోంది.    పాత విమానాలలో లోపలి భాగాల  నవీకరణ కోసం  టాటా గ్రూప్ 400 మిలియన్ డాలర్లను కేటాయించగా  అవసరమైన పరికరాల సరఫరా ఆలస్యమవుతోందని తెలుస్తోంది.  మరోవైపు ఈ విమాన సర్వీసులు తరచూ  ఆలస్యం అవుతున్నాయనే కామెంట్లు సైతం  వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు కంపెనీకి ఆర్థిక నష్టాలు మాత్రం కొనసాగుతున్నాయని తెలుస్తోంది.  తాజా దుర్ఘటనపై  దర్యాప్తులో  తేలే  అంశాలే  సంస్ట భవిష్యత్తును  దిశా నిర్దేశం చేయనున్నాయి.  మరోవైపు 171 నంబర్ కు  గుడ్ బై చెప్పే దిశగా  ఎయిర్ ఇండియా అడుగులు వేస్తోందని తెలుస్తోంది.  ఏఐ 171  కూలిపోవడం  ఎన్నో కుటుంబాల్లో  తీరని విషాదాన్ని నింపుతోంది.  


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: