అరుణాచలం అంటే ఒక పవిత్రమైన స్థలంగా భావిస్తారు హిందువులు. అరుణాచలం అనే పేరు వినగానే భక్తుల శరీరం పులకరించిపోతుంది. అరుణాచలానికి వెళ్లాలి అంటే కచ్చితంగా శివుడి ఆజ్ఞ లభిస్తేనే వెళ్తారనే విధంగా భావిస్తూ ఉంటారు భక్తులు. అయితే గత కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి వెళ్లే భక్తుల సంఖ్య రోజుకీ పెరుగుతోంది. మరి అరుణాచలానికి ఎలా వెళ్లాలి అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.


రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గంలో తిరువణ్ణామలైకి వెళ్ళవచ్చు.. రైలు ద్వారా అయితే కాన్ఫడీ జంక్షన్ వరకు వెళ్తుంది.  అక్కడ నుంచి 94 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాలి. తిరుపతి నుంచి అయితే 193 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

ఇక ఆలయంలో చూడదగిన విశేషాల విషయానికి వస్తే..
సర్వదర్శనం : ఉచితంగానే ఉంటుంది.
శీఘ్ర దర్శనం: 50 రూపాయలు

ఆలయ విశిష్టత విషయానికి వస్తే.. ఈ ఆలయం 25 ఎకరాలలో 9 గోపురాలతో ఉంటుంది.

ఈ ఆలయం శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినది. 217 అడుగుల రాజగోపురం కలదు. ఇది దేశంలోని అతిపెద్ద వాటిలో మూడవదిగా నిలిచింది.

1500 సంవత్సరంలోని ఈ గుడిని అబ్బురపరిచే శిల్పకలతో నిర్మించారు. ఈ గుడిలో శివుడు మహా అగ్ని లింగ రూపంలో కనిపిస్తారు.


అరుణాచలంలో అన్నదానంతో పాటు 50 రూపాయలకే రకరకాల ప్రసాదాలు లభిస్తాయి.

బిల్వ, అశ్వత్థ వృక్షాలు: సంతానం కోసం చెరుకు ఊయల ఆలయంలో ఉన్నది.

అంతేకాకుండా పెళ్లి కాని యువతి యువకులు ఇక్కడ ఉండే కాశీ నందిని దర్శించుకుంటారు.

గిరి ప్రదర్శన విషయానికి వస్తే..  వేకువజామున, రాత్రి సమయాలలో చేయడం మంచిది. అయితే పిల్లలకు పెద్దలకు వీల్ చైర్స్ సౌకర్యం కూడా కలదు, నడవలేని వారికి ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి.


పరమశివుడు కొండ రూపంలో కొలువయ్యారు. ఈ కొండ ఎత్తు 814 మీటర్లు 2669 అడుగుల ఎత్తున కలదు. అయితే ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4:30 నిమిషాల వరకు మాత్రమే కొండ ఎక్కేందుకు అనుమతి.

కార్తీకదీపోత్సవం ఇక్కడ ప్రత్యేకంగా జరుపుకుంటారు.  అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 4 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.


ఆర్యవైశ్య నిత్య అన్నదానం ట్రస్ట్.. గాలిగోపురం వద్ద, కన్యకాపరమేశ్వరి గుడి వీధి దగ్గర కలదు.అలాగే తమిళనాడు టెంపుల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హోమ్ స్టేలు కూడా కలవు. A, B, C బ్లాక్ లలో ఉండే వీటిలలో 120 AC, నాన్ ఏసీ రూములు కూడా కలవు. ఇందులో టిఫెన్ ఫ్రీ, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. HTTP// www. ttdconline.com  లో బుక్ చేసుకోవచ్చు.
 
అరుణాచలంలో ఎన్నో వసతులు కూడా కలవు. ముఖ్యంగా ఆంధ్ర ఆశ్రమం విషయానికి వస్తే.. ఇది శివసన్నిధి హోమ్ స్టే వద్ద కలదు. ఇక్కడ 22 గదులు కలవు . ఒక్కో గదిలో 6 మంది ఉండవచ్చు. అయితే బుకింగ్ కోసం నెల ముందు బుక్ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: