శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సైకో వీరంగం సృష్టించాడు. కేవలం అరగంట వ్యవధిలోనే ఐదుగురు మహిళలపై దాడికి దిగి.. అందర్నీ భయబ్రాంతులకి గురిచేశాడు.  స్థానిక నాయిబ్రహ్మణ వీధిలో జలదంకి విజయమ్మ (50) ఇంట్లో ఒంటరిగా ఉండటంతో ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడటమే కాకుండా తీవ్రంగా గాయపరిచాడు. ఆ సమయంలో రవి అనే యువకుడు రావడంతో ఒక్కసారిగా సైకో అతడిని తోసివేసి పరారయ్యాడు.
Image result for women rape
ఒంటేరు అంకమ్మ (70) ఇంట్లో నిద్రిస్తుండగా ఆమెపై కూడా తీవ్రంగా దాడి చేశాడు.ప్రస్తుతం అంకమ్మ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అనంతరం పూలతోట వారి వీధిలో ఓ వివాహిత ముగ్గు వేస్తుండటంతో ఆమెపై దాడి చేశాడు. లైబ్రరీ వీధిలో ఓ వివాహిత నిద్రిస్తుండగా అత్యాచారయత్నం చేశాడు. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, ఎస్సై వెంకట్రావు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను నెల్లూరు వైద్యశాలకు తరలించారు.
Image result for women rape
 ఇలా అరగంట వ్యవధిలోనే.. మహిళలను లక్ష్యంగా చేసుకుని సైకో వీరంగం సృష్టించడం జిల్లాలో సంచలనంగా మారింది. బాధితుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.  దాడి చేసిన ప్రతి చోటా ‘నాకు డబ్బులు ఇవ్వాలి కదా..? ఎప్పుడిస్తావ్..?’ అంటూ సైకో గట్టిగా అరిచినట్లు బాధితులు చెప్తున్నారు.

విషయం తెలుసుకున్న ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ బాధితుల ఇళ్లకు వెళ్లి పరిశీలించారు. అనంతరం రవితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా తిరుగుతుంటూ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: