దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబం వైసీపీ చెంతకు చేరిన నేపథ్యంలో వైఎస్ జగన్ ఇప్పుడు కొన్నిప్రశ్నలు ఎదుర్కోబోతున్నారు. దగ్గుబాటి కుటుంబంలో వైసీపీలో చేరడం కొంత వరకూ లాభంగానే భావిస్తున్నా.. కొన్ని ప్రశ్నలు జగన్ ఇబ్బంది పెడుతున్నాయి. దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ప్రత్యర్థలు ఈ ప్రశ్నలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అవేమిటంటే.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి.. ఇద్దరిలో ఎవరూ అమెరికాలో స్థిరపడలేదు. అలాంటిది కేవలం కాన్పుకు వెళ్లి కొడుకు హితేశ్కు ఎందుకు అమెరికా పౌరసత్వం తీసుకున్నారు..?
తండ్రిఅయిన ఎన్టీయార్ని సీఎం పదవి నుంచి తప్పించే సమయంలో పురందేశ్వరి, ఆమె భర్త ప్రధాన భూమిక పోషించారు.. చంద్రబాబు నాయుడికి అండగా నిలిచారు. ఎప్పుడైతే భర్తకు డిప్యూటీ సీఎం పోస్టు రాలేదో మీ ప్రాధాన్యత, విధేయత కొత్త మార్గం వైపు పయనించాయాలేదా..? ఇలా చాలాసార్లు విధేయత మారిందా లేదా..?
రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్లో చేరిన మీరు, ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవి కూడా అనుభవించిన మీకు ఎన్టీయార్ పెట్టిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వ్యతిరేకత పార్టీని ఎప్పుడూ గుర్తు రాలేదు..అలాంటి మీరు టీడీపీ కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రం ఎన్టీయార్ ఆత్మ క్షోభిస్తుందని ముసలికన్నీరు ఎందుకు కార్చారు..?మీ అబ్బాయిని వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫు నుంచి బరిలోకి దింపాలని చూడటం ఏపీలో బీజేపీ బలం లేదని చెబుతున్నట్లా కాదా..?
మీ అబ్బాయి వైసీపీ నుంచి మీరు బీజేపీ నుంచి ఉండటాన్ని ఎలా చూడాలి…యూఎస్ పౌరసత్వం ఉన్న మీ ఇద్దరి పిల్లలకు ఆధార్కార్డు, ఓటర్ కార్డు వంటివి కూడా రావుకదా.. వారిని ఏవేవో పత్రాల మాయ చేసి భారతీయులుగా చూపుతూ వైసీపీ తరఫున బరిలో నిలిపితే, ఒక ముఖ్యమంత్రి మనువళ్లు, కేంద్ర మంత్రి పిల్లలు, భారతీయ చట్టాలను ఏమేర గౌరవించినట్లు.. మీలో నైతికత ఏమున్నట్లు..?