ఏపీలో పోలింగ్ కు ఇంకా మూడు రోజులు మాత్రేమే ఉండటంతో దాదాపు అన్ని  ఛానళ్లు ఫైనల్ సర్వేలు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎన్టీటీవీ తన సర్వేను ప్రకటించింది. ఇందులో వచ్చి రిజల్ట్స్ షాకింగ్ గా ఉన్నాయి. ఈ ఛానల్ కేవలం ఎంపీ సీట్ల ఫలితాలు మాత్రమే కవర్ చేసింది.


ఎన్డీటీవీ సర్వేలో వైసీపీ మొత్తం 25 ఎంపీ సీట్లలో 20 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. ప్రాంతీయ పార్టీల్లో మూడో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందని ఎన్డీటీవీ అంచనా వేసింది. మొత్తం ఇరవై ఐదులో ఇరవై అంటే మామూలు విషయం కాదు.. ఒక విధంగా ఇది ప్రభంజనం తరహా ఫలితాలు.. 

మరి ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నందువల్ల.. ఎంపీ సీట్ల లెక్కలను బట్టి చూస్తే వైసీపీకి కనీసం 120 నుంచి 130 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టే. ఇప్పుడు ఏపీలో ఉన్న టైట్ ఫైట్ పరిస్థితుల్లో ఈ స్థాయి మెజారిటీ సాధ్యమేనా.. అన్న చర్చ నడుస్తోంది. 

ఐతే.. చాలాసార్లు ప్రజల్లో నిశబ్ద విప్లవం ఉంటుంది. దాన్ని పసిగట్టడం కష్టం. ఒక్కఛాన్స్ అంటున్న జగన్ మొరను ఓటరు ఆలకిస్తే.. ఈ స్థాయి ప్రభంజనం అసాధ్యం..అనూహ్యం కాదు. మరి ఎన్డీటీవీ ఫలితాలు ఏమేరకు వాస్తవం అవుతాయో ఓట్ల లెక్కింపు రోజు కానీ తెలియదు.



మరింత సమాచారం తెలుసుకోండి: