తెలుగు దేశం లో అసలు ఏం జరుగుతోంది. ? ఆ పార్టీ నుంచి బిజెపి వైపు వలసలు నిజమేనా..? చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చేసరికి నిజంగానే టీడీపీ ఖాళీ అవుతోందా..? ఆ స్థాయిలో బిజెపి నుంచి వలసలు ఉంటాయా..?
ఇవి ఇప్పుడు సగటు తెలుగుదేశం అభిమానిని వేధిస్తున్న ప్రశ్నలు. కానీ వీటికి సమాధానం చెప్పేవారు ఇప్పుడు కరువయ్యారు. పార్టీ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. కానీ అదేం లేదు అని ధైర్యం చెప్పే ఒక్క నాయకుడు ఇప్పుడు కనిపించడం లేదు.
అంటే ఒక రకంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దిక్కులేకుండా తయారైంది. పార్టీ అధ్యక్షుడు బాబు, లోకేష్.. ఇద్దరూ విదేశీ పర్యటనలోనే ఉండడంతో పార్టీ నేతలను సముదాయించే వారే లేక పోయారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు అంతా తానే నడిపించడం మైనస్ గా మారింది.
పార్టీలో సంక్షోభాలను నివారించే స్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహించక పోవడం ఇప్పుడు ఆ పార్టీ పాలిట శాపంగా మారింది. తెలుగుదేశం పార్టీలో ఇంత జరుగుతున్నా.. ఏ ఒక్క నాయకుడు కూడా బాధ్యత తీసుకొని మీడియా ముందుకు రాకపోవడం విశేషం.