
వినడానికి వింతగా, ఆశ్చర్యంగా అనిపించినా తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు నగరానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువేంని ఆలయాన్ని దర్శించుకోవడం ద్వారా మధుమేహం నయమైపోతుందట. ఈ ఆలయంలో శివుడు లింగరూపంలో ఉంటారు. ఇక్కడ శివుడు వెన్ని కరంబేశ్వరార్ గా పార్వతి దేవి సుందరి నాయకిగా పూజలందుకుంటున్నారు. ఈ ఆలయం స్వయంభూ ఆలయం కావడం గమనార్హం.
ఇక్కడ చేతిలో చెరుకు ముక్కను పట్టుకుని ఉన్న శివుడి ప్రతిమ ఆలయంపై దర్శనం ఇవ్వనుంది. మన దేశ నలుమూలల నుండి ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి కోట్ల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు చక్కర, గోధుమ రవ్వతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. ఈ ప్రసాదంలో కొంత భాగాన్ని చీమలకు సమర్పిస్తారు. చీమలు ఈ ప్రసాదం తింటే మాత్రం తమ వ్యాధి తగ్గుతుందని భక్తులు విశ్వసిస్తారు.
ఈ ఆలయంలోని శివలింగం శివుడు ప్రతిష్టించిన శివలింగం కావడం గమనార్హం. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ ఆలయానికి ఇతర దేశాల నుండి కూడా భక్తులు వస్తారని భోగట్టా. ఈ ఆలయానికి సంబంధించిన వింతలు, విశేషాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు