చైనా మాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అంతేకాకుండా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణయ్ పై కూడా బిసిసిఐ నమ్మకం ఉంచింది. అతనికి జట్టులో అవకాశం కల్పించింది. మొదటి సారి భారత జట్టులో ఆడబోతున్నాడు రవి బిష్ణయ్. హజారే ట్రోఫీ లో అదరగొట్టిన దీపక్ హుడా కూడా వన్డే జట్టులో స్థానం దక్కించుకోవడం గమనార్హం. ఇక రవిచంద్రన్ అశ్విన్కు మాత్రం వన్డే టి20 లలో అవకాశం దక్కకపోవడం గమనార్హం. అదే సమయంలో దక్షిణాఫ్రికాలో ఊహించిన స్థాయిలో రాణించలేక పేలవా ప్రదర్శనతో నిరాశ పరిచిన కారణంగా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను పక్కనపెట్టేసింది బీసీసీఐ.
ఇక ఇటీవలే జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యువ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ను జట్టు నుంచి తప్పించింది. మరోవైపు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ టి20 సిరీస్కు దూరమవ్వగా.. ఇషాన్ కిషన్ వన్డే జట్టుకు దూరమయ్యాడు. స్టార్ బౌలర్లు జస్ప్రిత్ బూమ్రా షేమి లకు విశ్రాంతి ఇచ్చింది బిసిసీఐ. ఒకవైపు కేఎల్ రాహుల్ కూడా తొలి వన్డేలో ఆడటం లేదు అన్నది తెలుస్తుంది. ఇక రవీంద్ర జడేజా ఇంకా వ్యాక్సిన్ తీసుకోకపోవడంతో జట్టులోకి ఎంపిక చేయలేదు. వెస్టిండీస్తో భారత జట్టు ఆడబోయే వన్డే, టి20 సిరీస్ లో అనూహ్యమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 6 నుంచి సిరీస్ ప్రారంభం కాబోతుంది. అహ్మదాబాద్ వేదికగా జరగబోతుంది టి20 సిరీస్.