"శుభాంశు శుక్లా".. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగి పోతుంది . సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. భారత మానవ సహిత అంతరిక్ష యాత్రకు "శుభాంశు శుక్లా" ఓ మైల్ స్టోన్ అంటూ అందరూ పొగిడేస్తున్నారు . ఇండియన్ ఆస్ట్రోనెంట్ భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ "శుభాంశు శుక్లా" చారిత్రాత్మక స్పేస్ జర్నీకి శ్రీకారం చుట్టారు . నలుగురు వ్యోమగాములతో ఆక్సీఎం నాలుగు బుధవారం రోజు మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషాలకు నింగిలోకి విజయవంతంగా తీసుకెళ్లింది. ఇందులో మన భారత వ్యోమగామి "శుభాంశు శుక్లా" కూడా ఉండడం భారతీయులు గర్వించతగ్గ విషయం .


మరీ ముఖ్యంగా విండ్ కమాండర్ రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షానికి చేరుకున్న రెండో భారతీయుడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు "శుభాంశు శుక్లా".  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కు వెళ్లిన తొలి ఇండియన్ గా చైర్త్ర లో నిలిచిపోతాడు "శుభాంశు శుక్లా". "శుభాంశు శుక్లా" అంతరిక్ష ప్రయాణనికి బయిలుదేరే ముందు  తనకు ఎంతో ఇష్టమైన ఒక పాటను విన్నారు.  ఆ పాట మరేంటో కాదు గత ఏడాది రిలీజ్ అయిన " ఫైటర్ " సినిమాలోని "వందేమాతరం" పాట.



ఈ పాట వింటే గూస్ బంప్స్ పక్క.  ప్రతి ఒక్క ఇండియన్ రోమాలను నిక్కబొడుచుకునే పాట ఇది.  ఈ పాట అంటే ఆయనకు చాలా చాలా ఇష్టమట . అందుకే అంతరిక్షంలోకి వెళ్లే ముందు ఆయన తన ఫేవరెట్ అయిన ఈ పాటను విన్నారట ." విజయం అనేది ప్రతి భారతీయుడు నరాల్లో ఉంటుంది . మన పరాక్రమానికి శత్రువు కూడా సెల్యూట్ చేయాల్సిందే " అంటూ సాగే ఈ పాట దేశభక్తిని కలగజేస్తుంది.  ప్రముఖ దర్శకుడు సిద్ధార్ధ్  ఆనంద్ రూపొందించిన ఫైటర్ లో బాలీవుడ్ నటీనటులు హృతిక్ రోషన్ అదే విధంగా దీపిక పదుకొనే తదితరులు  నటించి మెప్పించారు . ఈ పాట ఎప్పుడు విన్నా సరే తెలియని గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తుంది.  దేశభక్తిని చాటే పాట ఇది . ఈ పాట వినే "శుభాంశు శుక్లా" తన జర్నీ స్టార్ట్ చేయడం ఇంకా హైలైట్ గా మారింది . కాగా ఫ్లోరిడాలోని నాటి స్పేస్ సెంటర్లో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలకన్  9 రాకెట్ను ప్రయోగించారు.  దీనికి "శుభాంశు శుక్లా" మిషన్ పైలెట్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: