జపనీస్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కవాసకి (Kawasaki) ఇండియన్ మార్కెట్లో తమ సరికొత్త మోడల్ నింజా 300 (2022 Kawasaki Ninja 300) స్పోర్ట్స్ బైక్ ను రిలీజ్ చేసింది. మార్కెట్లో కొత్త 2022 కవాసకి నింజా 300 ధర వచ్చేసి రూ. 3.37 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. గతంలో అమ్మబడిన పాత మోడల్ నింజా 300 ధర రూ. 3.24 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. ఇక ఇది పాత మోడల్‌ తో పోలిస్తే, ఈ కొత్త మోడల్ ధర వచ్చేసి రూ.13,000 పెరిగింది. ఈ కొత్త 2022 మోడల్ లో కంపెనీ కొత్త బాడీ గ్రాఫిక్స్ ఇంకా అలాగే కొత్త పెయింట్ స్కీమ్‌ లను కూడా పరిచయం చేసింది.అలాగే కవాసకి బ్రాండ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఈ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ కూడా ఒకటని చెప్పాలి. అయితే, కంపెనీ ఈ మోడల్ లో చేసిన అప్‌డేట్స్ పరంగా బైక్ ఔత్సాహికులను నిరుత్సాహపరిచందనే చెప్పాలి. ఈ కొత్త 2022 మోడల్ కేవలం కాస్మెటిక్ మార్పులు తప్ప కంపెనీ వేరే ఏ ఇతర మార్పులు కూడా చేయలేదు.



కొత్త 2022 కవాసకి నింజా 300 బైక్ ఇప్పుడు మూడు సరికొత్త రంగులలో లభిస్తుంది. వీటిలో కవాసకి సిగ్నేచర్ కలర్ లైమ్ గ్రీన్‌ తో పాటుగా క్యాండీ లైమ్ గ్రీన్ ఇంకా అలాగే ఎబోనీ అనే మరో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి.అలాగే నింజా 300 క్యాండీ లైమ్ గ్రీన్ ఇంకా అలాగే ఎబోనీ పెయింట్ స్కీమ్స్ పై కంపెనీ కొత్త గ్రాఫిక్స్ ను జోడించింది. ఈ అప్‌డేటెడ్ బాడీ గ్రాఫిక్స్ ఫ్రంట్ ఫెయిరింగ్ ఇంకా ఫ్యూయెల్ ట్యాంక్‌ పై ప్రధానంగా కనిపిస్తాయి. ఇక, లైమ్ గ్రీన్ కలర్ విషయానికి గనుక వస్తే, ఇది మునుపటి 2021 ఎడిషన్ లాగానే అదే పాత గ్రాఫిక్‌ లను కూడా కలిగి ఉంటుంది. ఇక కవాసకి తమ నింజా 300 బైక్ ను చివరిసారిగా మార్చి 2021 లో అప్‌డేట్ చేసింది. ఆ సమయంలో ఈ బైక్ లోని బిఎస్4 ఇంజన్ స్థానంలో కంపెనీ కొత్త బిఎస్6 ఇంజన్ ను కూడా ప్రవేశపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: