ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తిని ప్రధాని మోదీ ఓకే చేశారు. ఇప్పటి వరకూ టీటీడీ ఈవోగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మారెడ్డికి ఇంకో రెండేళ్ల పాటు కేంద్రం డిప్యూటేషన్ పెంచింది. ధర్మారెడ్డి రాష్ట్ర సర్వీసులో కొనసాగేందుకు కేంద్రం అనుమతిచ్చింది. వాస్తవానికి ధర్మారెడ్డి ఇండియన్‌ డిఫెన్స్‌ ఎస్టేట్‌ సర్వీస్‌ అధికారి. ఆయన్ను ఏడేళ్ల క్రితం రాష్ట్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై తీసుకున్నారు. మే 31 తో ముగిసిన ధర్మారెడ్డి ఏడేళ్ల డిప్యుటేషన్‌ కాలం పూర్తవుతోంది. అయితే.. దాన్ని మరో రెండేళ్లు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీంతో ధర్మారెడ్డికి కేంద్ర అనుమతి ఇచ్చింది. మరో రెండేళ్లు ఏపీలో డిప్యుటేషన్‌పై కొనసాగేందుకు అంగీకారం తెలిపింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ధర్మారెడ్డి కొనసాగుతారు. రెండేళ్ల సర్వీస్ కొనసాగింపునకు అంగీకరిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: