విశాఖలోని ప్లాస్టిక్ తయారీ కంపెనీ అయిన ఎల్జి పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువులు పడి ఎంతో మంది ప్రజలను ప్రాణాపాయ స్థితిలో పెట్టిన విషయం తెలిసిందే అయితే ప్రస్తుతం వారందరికీ ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రిలో కూడా ఆక్సిజన్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... విశాఖ ప్రమాదంపై ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసారు. ఎన్డీఆర్ఎఫ్, ఎన్డీఎంఏ సభ్యులతో మోదీ స్పెషల్ టీం ఏర్పాటు చేసి విశాఖ గ్యాస్ లీక్ ఘటనలోని బాధితులకు సహాయం చేయాలని ఆదేశించారు. అయితే విశాఖలో ఆక్సిజన్ కొరత ఏర్పడగాఇప్పటికే నేవి ఆక్సిజన్ అందించింది.ప్రత్యేక బృందాలు రంగంలోకి స్థానిక ప్రభుత్వంలో కలిసి పనిచేయాలని మోదీ ప్రత్యేక బృందాలకు సూచనలు సలహాలు ఇచ్చారు..?