కరోనా లాక్ డౌన్ లో కాస్త సడలింపులు ఇవ్వడంతో ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న వారు ఒక్కొక్కరిగా గత వారం రోజుల నుంచి నిదానంగా బయటకు అడుగు పెడుతున్నారు. దీనితో ఇన్నాళ్ళ నుంచి జరగని ప్రమాదాలు మళ్ళీ జరుగుతున్నాయి. 

 

కరోనా నుంచి ప్రాణాలు కాపాడుకున్నా జనాలు ఇప్పుడు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలోని పాకాల మండలం గుండ్ల గుట్టపల్లి గ్రామంలో కారు బోల్తా పడి అక్కడిక్కడే ముగ్గురు చనిపోయారు. ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలు అయిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: