ఉత్తరప్రదేశ్ లో కరోనా కేసులు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఇన్ని రోజులు అక్కడ కరోనా కట్టడి సమర్ధవంతంగా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా సరే ఇప్పుడు మాత్ర౦ అక్కడ భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడిలో సమర్ధవంతంగా వ్యవహరిస్తున్న సరే కేసులు మాత్రం ఆగడం లేదు. 

 

ఇక అక్కడ ఒక్క రోజే 1300 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 1346 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 9,514 గ ఉన్నాయి అని ప్రభుత్వం పేర్కొంది. మొత్తం 19 వేల 627 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డారు అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అక్కడ 827 మంది కరోనా కారణంగా మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: