మ‌న‌దేశంలో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా చూస్తే 28500 కొత్త కేసులు న‌మోదు కాగా ఏకంగా 563 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇక మ‌న దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసులు 9 ల‌క్ష‌లు దాట‌గా.. క‌రోనా మ‌ర‌ణాలు 23 వేలు దాటేశాయి. ఇక ఐటీ రాజ‌ధాని బెంగ‌ళూరులో క‌రోనా రోజు రోజుకు ఉగ్ర‌రూపం దాల్చుతోంది.

 

ఇక రోజు రోజుకు కేసులు పెరుగుతుండ‌డంతో అక్క‌డ మ‌రో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించారు. ఇక బెంగ‌ళూరులో మాస్క్ లు లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చే వారికి రు. 200 ఫైన్ వేస్తున్నారు. ఇలాంటి ఫైన్ గ‌త వారం రోజుల్లోనే ఏకంగా కోటి రూపాయ‌లు వ‌సూలైంది. దీంతో బ‌య‌ట‌కు వ‌చ్చేవాళ్లు మాస్క్‌లు లేకుండా రావాలంటేనే భ‌య‌ప‌డే పరిస్థితి వ‌చ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: