తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సమీక్ష  నిర్వహించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాలు, నిర్వహణ ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు, ఇతర అంశాలపై విస్తృతంగా  చర్చించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2ర ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అమర వీరుల స్తూపం వద్దకు తెలంగాణ అమరులకు  నివాళులు అర్పిస్తారని సీఎస్ సోమేష్‌ కుమార్‌ తెలిపారు. అనంతరం పబ్లిక్ గార్డెన్‌కు చేరుకొని జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని సీఎస్ అన్నారు. పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందని  సీఎస్‌ అధికారులకు వివరించారు. అదే రోజు సాయంత్రం రవీంద్రభారతిలో 30 మంది ప్రముఖ కవులచే కవి సమ్మేళనం ఉంటుందని సీఎస్‌ వివరించారు.


ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, హోం శాఖ కార్యదర్శి రవిగుప్త,  హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ తదితరులు కూడా హాజరయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

kcr