
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులు తప్పనిసరిగా KYC ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. ఏడాది లోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో KYC ప్రక్రియలో 95 శాతం పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచినట్లు ఆయన గర్వంగా తెలిపారు. గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పాత రేషన్ కార్డులను మార్చుకుని కొత్త స్మార్ట్ కార్డులను ఉచితంగా పొందవచ్చని సూచించారు.
ఇప్పటివరకు 72 వేల 500 మంది స్మార్ట్ కార్డులను పొందినట్లు మంత్రి వెల్లడించారు. ఒంటరిగా ఉండి 50 ఏళ్లు దాటిన అవివాహితులకు, మొదటిసారిగా లింగ మార్పిడి వ్యక్తులకు కూడా రేషన్ కార్డులు అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్య సామాజిక సమానత్వానికి దోహదపడుతుందని తెలిపారు. గిరిజన సమూహాలకు 35 కిలోల బియ్యం అందించే కార్డులను కూడా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం సమర్థవంతమైన ఆహార భద్రతా వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు