మనకు మన ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలతో ఒక డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల ఎండ నుండి ఈజీగా ఉపశమనాన్ని పొందవచ్చు. ఇంకా అలాగే చక్కటి ఆరోగ్యాన్ని కూడా ఈజీగా సొంతం చేసుకోవచ్చు.ఈ డ్రింక్ ని తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఇంకా అలాగే శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. ఇక మనకు అందుబాటులో ఉండే పదార్థాలతో చేసుకునే ఈ హెల్తీ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి ఇంకా దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి? వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ హెల్తీ డ్రింక్ తయారీకి కావల్సిన పదార్థాల విషయానికి వస్తే..పాలు – అర లీటర్, నానబెట్టిన బాదంపప్పు -20, కస్టర్డ్ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్ ఇంకా పంచదార – 4 టేబుల్ స్పూన్స్, తరిగిన డ్రై ఫ్రూట్స్ – కొద్దిగా, యాలకుల పొడి – అర టీ స్పూన్ అలాగే నానబెట్టిన సబ్జా గింజలు -ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి.


ఈ హెల్తీ డ్రింక్ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా బాదంపప్పుని తీసుకొని దానిపై ఉండే పొట్టును తీసేసి బాదం గింజలను ఒక జార్ లోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో కస్టర్డ్ పౌడర్, పావు కప్పు నీళ్లు పోసి పలుకులు లేకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత కళాయిలో పాలు పోసి వేడి చేయాలి.ఆ పాలు పొంగు వచ్చిన తరువాత ఇందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆ తరువాత ఇందులో యాలకుల పొడి, పంచదార ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. 


ఈ పాలను 4 నిమిషాల పాటు అలాగే కలుపుతూ మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తరువాత సబ్జా గింజలని వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ను రెండు గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచి చల్లగా అయిన తరువాత తీసుకోవచ్చు లేదా ఐస్ క్యూబ్స్ వేసి అప్పటికప్పుడు కూడా దీనిని తీసుకోవచ్చు. ఈ విధంగా పాలు ఇంకా బాదంపప్పుతో డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల రుచికి రుచిని ఇంకా ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: