ఫోక్ సింగర్ కుమ్మరి దుర్గవ్వ ఇప్పుడు అందరికీ తెలుసు .ఎలా అంటే భీమ్లానాయక్ సినిమా వల్ల. పవన్ కళ్యాణ్, రానా మెయిన్ లీడ్‌లో వస్తోన్న భీమ్లానాయక్ సినిమాలో అడవి తల్లి మాట అనే పాటను పాడి అందరిని ఆకట్టుకుంది కుమ్మరి దుర్గవ్వ.ఇక ఆమెతో పాటుగా సాహితి చాగంటి ఈ పాటను పాడారు. అయితే తమన్ స్వరపరిచిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. కాగా ఫోక్ సాంగ్ స్టయిల్‌లో ఉన్న ఈ సాంగ్‌కి శ్రోతలు ఫిదా అయిపోయారు.అయితే ఈ పాటను కేవలం నాలుగైదు నిమిషాలలోనే పాడిందట దుర్గవ్వ. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ పాట పాడినందుకు గాను ముందుగా ఆమెకి పది వేల రెమ్యునరేషన్ ఇచ్చారట.

అయితే మిగిలిన డబ్బులను తన కూతురికి ఇచ్చారని దుర్గవ్వ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతే కాదు ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్, తమన్ లకి ధన్యవాదాలు చెప్పింది దుర్గవ్వ. ఇక ఈమె మంచిర్యాల జిల్లాకి చెందిన ఆమె... చదువుకోలేదు కూడా .. పంటపనులకి పోయినప్పుడు అక్కడే పాట పాడడం నేర్చుకుందట. ఇలానే పాడడం అలవాటు చేసుకుంది.అయితే దుర్గవ్వ తెలుగులోనే కాదు మరాఠీ బాషలో కూడా పాటలు పాడతారు. ఇకపోతే ఇప్పటికే ఆమె పాడిన ఉంగురమే రంగైనా రాములాల టుంగురమే, సిరిసిల్లా చిన్నది మొదలుపాటలకి మంచి క్రేజ్ వచ్చింది.

ఇక భీమ్లానాయక్ సినిమా విషయానికి వస్తే... నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటించారు.కాగా ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రేపు(ఫిబ్రవరి 25)న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.కాగా ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. ఇక సినిమా పైన పవన్ అభిమానులకు భారీ అంచనాలున్నాయి.రఘు బాబు, మురళి శర్మ, రావు రమేష్, సముద్రఖని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: