ప్రస్తుతం హీరోయిన్ రాశి ఖన్నా చేతిలో దాదాపుగా ఆరు సినిమాలు ఉన్నాయి.. అయితే ఇప్పుడు తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు హీరో శర్వానంద్ నటించబోతోందట. ప్రస్తుతం ఒకే ఒక జీవితం సినిమా షూటింగ్లో శర్వానంద్ కూడా ఉన్నారు. త్వరలోనే కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ఒక చిత్రంలో నటించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడీగా హీరోయిన్ రాశి ఖన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో సర్వ ఇప్పటివరకు కనిపించని పాత్రలో నటించబోతున్నట్లు గా సమాచారం. ఇప్పటికే చిత్ర యూనిట్ రాశి ఖన్నా సంప్రదించగా ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన రావడం లేదు ఈ నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉన్నది.. ఆ తరువాత వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ట్లు గా సమాచారం. ఈ సినిమాలు సరికొత్తగా కనిపించేందుకు శర్వానంద్ బరువు తగ్గే పనిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది మరి ఈ జోడి నిజంగానే సిల్వర్ స్క్రీన్పై అలరిస్తుందో చూడాలి.