టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోల అందరి సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపున సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈమె హీరోయిన్ గానే కాకుండా విలన్ గా కూడా నటించి.. ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతేకాదు ఈమె అవకాశాలు కనుమరుగవుతున్న సమయంలో ఐటెం సాంగ్స్ లో కూడా అందరిని అలరించింది. కొన్ని సంవత్సరాల క్రితం సినిమాలకు దూరమైన రాశీ ఫ్యామిలీ తో లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. ఇప్పుడు బిజినెస్ లో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది. 

అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా అలరిస్తూ సందడి చేస్తూ ఉంటుంది.  రాశి బాలనటిగా సినీ అరంగేట్రం చేసిన తర్వాత స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.చూడడానికి బొద్దుగా, హోమ్లీ గా అనిపించే రాశీ తన వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో వివాదాలు చోటుచేసుకున్నాయి.ఇక  ఆమె తన జీవితంలో ఏకంగా మూడు వివాహాలు చేసుకుంది. ఏకంగా తాను మూడు వివాహాలు చేసుకోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.రాశి తనకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తమిళ్ దర్శకుడు అశోక్ సామ్రాట్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. కఇంట్లో వీరీ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆమె అశోక్ సామ్రాట్ తో ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.

ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు.ఇక ఆ తర్వాత మనసిచ్చి చూడు దర్శకుడు సురేష్ వర్మను కూడా వివాహం చేసుకుంది. ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య ఒద్దిక లేక మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు . అయితే తర్వాత రాశి శ్రీనివాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం అతనితో ఫ్యామిలీ లైఫ్ ను చక్కగా ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతోంది. రాశి కెరియర్ లో మూడు పెళ్లిళ్లు చేసుకుంది అనే టాకు వినిపిస్తున్నప్పటికీ ఇందులో ఎంత నిజం ఉంది అనే సాక్షాలు మాత్రం తెలియలేదు.కాగా  ఈమే కూడా ఎప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు.ఇలా ఈమెకు సంబంధించిన ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: