పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.ఇక తను ఎక్కువగా రాజకీయం వైపే మక్కువ చూపిస్తూ అందుకు సంబంధించిన పలు కార్యక్రమాలలో పవన్ పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో చాలా సినిమాలు చేయవలసి ఉండగా అవన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరిగా భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఆ వెంటనే డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే చిత్రంలో నటించారు .ఈ సినిమా కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది.


ఇటీవల కాలంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యక్రమాలలోనే పాల్గొంటూ వైజాగ్ వెళ్ళిన పవన్ కళ్యాణ్ అక్కడ కొంతమంది రాజకీయ నేతల పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు ప్యాకేజీ స్టార్ అంటే ఒక్కొక్కరికి తోలు తీసేస్తానంటూ తెలియజేశారు.ఈ నేపథ్యంలో తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు పవన్ కళ్యాణ్. గత కొన్ని నెలలుగా వాయిదా పడుతున్న హరిహర వీరమల్లు సినిమా షెడ్యూల్ ని అక్టోబర్ 17 నుంచి మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. కానీ పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యల తర్వాత ఏపీలో రాజకీయ వేడి మరింత బలపడిందని చెప్పవచ్చు.


దీంతో ఈ సినిమా షూటింగ్ మళ్లీ పవన్ కళ్యాణ్ హోల్డ్ లో పెట్టినట్లుగా తాజా పరిణామాలు తెలుస్తున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయం మాత్రం ఇంకా చిత్ర బృందం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో డైరెక్టర్ క్రిష్ పరిస్థితి ఇప్పుడు ఏంటో అంటూ పలువురు నెటిజన్ల సైతం కామెంట్లు చేస్తున్నారు. ముందుగా డిసెంబర్ నాటికి ఈ సినిమాను పూర్తి చేయాలని ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ పవన్ కళ్యాణ్ తన రీమేక్ చిత్రాలను తెరకెక్కించాలని ప్లాన్ వేసినట్లుగా సమాచారం కానీ పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఇక ఆయన నటించిన సినిమాలు ఎప్పుడు పట్టాలెక్కుతాయో తెలియదు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు అన్నట్లుగా ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: